Live Updates: ఆంధ్రప్రదేశ్ లో తొలివిడత పంచాయతీ ఎన్నికలు

Live Updates: First Phase Andhra Pradesh Panchayat Elections 2021
x

Live Updates: First Phase Andhra Pradesh Panchayat Elections 2021

Highlights

కృష్ణా జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు:కృష్ణా జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు హక్కును...

కృష్ణా జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు:

కృష్ణా జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠ భద్రత చేపట్టారు.

నెల్లూరు జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు:

నెల్లూరు జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొదట మందకొడిగా సాగిన పోలింగ్‌.. మధ్యాహ్నం అయ్యేసరికి ఊపందుకుంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్‌ కేంద్రాల దగ్గర బారులు తీరారు.

అనంతపురం జిల్లాలో తొలివిడత పంచాయతీ పోలింగ్‌:

అనంతపురం జిల్లాలో తొలివిడత పంచాయతీ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఇప్పటికే 65శాతం పోలింగ్‌ నమోదైంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత:

చిత్తూరు జిల్లా పుంగనూరులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్క్రూటీనీలో పేర్లు తారుమారు చేశారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నామినేషన్లను వ్యూహాత్మకంగా తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories