GBS Disease: బర్డ్ ఫ్లూ కంటే భయంకరమైన వ్యాధి ..రాష్ట్రంలో తొలి మరణం


Heart Attack: గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థిని మృతి
GBS Disease: కొత్త వైరసులు, కొత్త జబ్బులు ఈ పేరు వింటేనే జనాలు హడలిపోతున్నారు. జీబిఎస్ వ్యాధి సోకిన కేసులు ఏపీలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా...
GBS Disease: కొత్త వైరసులు, కొత్త జబ్బులు ఈ పేరు వింటేనే జనాలు హడలిపోతున్నారు. జీబిఎస్ వ్యాధి సోకిన కేసులు ఏపీలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా కమలమ్మ అనే ఓ 50ఏళ్ల మహిళ ఈ జబ్బుతో మరణించింది. దీంతో జనంలో మరింత భయం పెరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ రెండు రోజుల క్రితమే వ్యాధి లక్షణాలతో గుంటూరు జీజీహెచ్ లో చేరింది. చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు వైద్యులు చెప్పారు.
రాష్ట్రంలో ఈ కొత్త వ్యాధి సోకి చనిపోయిన తొలి మహిళ ఇమే కావడంతో వైద్యులు కూడా టెన్షన్ పడుతున్నారు. ప్రజలను అప్రమత్త చేయడంతోపాటు జీబీఎస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో 17 మందిలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించగా..గుంటూరు జీజీహెచ్ లోనే ఏడుగురు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జీజీహెచ్ కు కమలమ్మను తీసుకువచ్చిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఇది జీబీఎస్ గా నిర్థారించారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు మరెవరిలో లేవని తేల్చారు. ఓ పక్క కోళ్లలో వచ్చిన బర్డ్ ఫ్లూ ఇప్పుడు మనుషుల్లోనూ గుర్తించారు. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడింది. వైద్యారోగ్యశాఖ అధికారులు ఈభయాందోళనలో ఉండగానే మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఏపీకి పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్ లలో ఈ వ్యాధి ఇప్పటికే తీవ్ర కలవరం పుట్టించింది. ఇటీవల ఇది తెలంగాణలోనూ ప్రవేశించింది. ఏపీలో ఏకంగా మొదటి మరణానికి కారణమైంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



