Andhra Pradesh: కృష్ణాజిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు గుర్తింపు

First Black Fungus Case in Krishna District
x

కలెక్టర్ ఇంతియాజ్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Andhra Pradesh: ఉయ్యురుకి చెందిన పంచాయతీ కార్యదర్శి బ్లాక్ ఫంగస్‌తో మృతి. విచారణకి ఆదేశించిన కలెక్టర్ ఇంతియాజ్.

Andhra Pradesh: ఏపీలోని కృష్ణాజిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసును గుర్తించారు. ఉయ్యురుకి చెందిన పంచాయతీ కార్యదర్శి బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందారు. దీంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఈ విషయంపై విచారణ చేసి, పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు.

కాటూరు పంచాయతీ కార్యదర్శి బాణవతు రాజశేఖర్.. కొద్ది రోజులుగా కరోనా తో బాధపడుతున్నాడు. కాగా, ఈ రోజు మరణించాడు. అయితే, మొదట కొవిడ్ తో మృతి చెందినట్టు డాక్టర్లు నిర్దారించారు. కానీ, ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ తో మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories