కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఘాటు విమర్శలు

విద్య, వైద్యం ప్రైవేటీకరణ చేస్తామంటున్న కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 12 Nov 2025 2:32 PM IST
కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఘాటు విమర్శలు
X

కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఘాటు విమర్శలు

విద్య, వైద్యం ప్రైవేటీకరణ చేస్తామంటున్న కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మండిపడ్డారు. నియంతృత్వ పాలన కలిగిన హిట్లర్, ముసోలిని వంటివారు ప్రజా వ్యతిరేకత నిర్ణయాల తీసుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు అనుమతి తీసుకొనివచ్చి పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎంతో తాపత్రయపడితే.. కూటమి ప్రభుత్వం వేల కోట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తుందన్నారు.

మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేస్తూ పేద ప్రజలకు ఇబ్బందులు కలగ చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటూ ప్రభుత్వాని రాచమల్లు హెచ్చరించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి MRO కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంఛార్జీ తహాసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story