Ramprasad Reddy: కేబినెట్ మీటింగ్‌లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు.. ఓదార్చిన సీఎం చంద్రబాబు!

Ramprasad Reddy: కేబినెట్ మీటింగ్‌లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు.. ఓదార్చిన సీఎం చంద్రబాబు!
x

Ramprasad Reddy: కేబినెట్ మీటింగ్‌లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు.. ఓదార్చిన సీఎం చంద్రబాబు!

Highlights

Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు అంశం చర్చకు వచ్చిన సందర్భంగా రాయచోటి ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు.

అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లికి మారుస్తూ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేబినెట్ చర్చలు సాగుతుండగా, తన నియోజకవర్గమైన రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని తరలించడంపై రాంప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు తాను సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, ఈ నిర్ణయం తనను కలచివేస్తోందని చెబుతూ ఆయన కళ్లు చెమర్చారు.

సీఎం భరోసా: "రాయచోటి అభివృద్ధి నా బాధ్యత"

మంత్రి ఆవేదనను గమనించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. రాంప్రసాద్ రెడ్డి దగ్గరకు వెళ్లి ఆయనను ఓదార్చారు. ఈ సందర్భంగా సీఎం కొన్ని కీలక విషయాలను వివరించారు. పరిపాలనా సౌలభ్యం, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చడం అనివార్యమని, ఇందులో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు.

"రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చినా, ఆ పట్టణ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను. రాయచోటికి ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం" అని చంద్రబాబు మంత్రికి హామీ ఇచ్చారు. రాంప్రసాద్ రెడ్డి లాంటి కష్టపడే నాయకులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగనివ్వమని భరోసా ఇచ్చారు.

రాజకీయ ప్రాధాన్యత

రాయచోటి నుంచి గెలిచిన రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కేంద్రం మార్పును మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చారు. గతంలో "రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మారిస్తే రాజీనామాకైనా సిద్ధం" అన్నట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో, నేటి కేబినెట్ సమావేశంలో ఆయన కన్నీరు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. అయితే సీఎం స్వయంగా హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories