పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు తరహా ఘటన
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలో కలకలం రేగింది. కొమిరేపల్లిలో ఏలూరు తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని ప్రజలు వింతవ్యాధి లక్షణాలతో ఉన్నట్టుండి కిందపడిపోతున్నారు. దీంతో జనాలకు ఏం జరుగుతుందో తెలియక భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే 13 మంది తీవ్ర అస్వస్థత కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ అబ్బయ్య చౌదరి కొమిరేపల్లికి బయల్దేరారు.
Next Story




