ఏపీ సీఎం జగన్‌కు ఈడీ సమన్లు

* ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని ఆదేశం * అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్‌ ఇటీవల ఈడీ కోర్టుకు బదిలీ * భూ కేటాయింపుల ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు

Sandeep Eggoju
Updated on: 9 Jan 2021 5:57 PM IST
Andhra Pradesh chief minister Jagan
X

Chief minister Jagan (representational Image)

సీఎం జగన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్‌ ఇటీవల నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయ్యింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్ట విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డితో పాటు.. అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్ శరత్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ బీపీ ఆచార్యకు సమన్లు జారీ చేసింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story