ఉన్నతాధికారులతో ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ భేటీ

Arun Chilukuri
Updated on: 21 Jan 2021 6:00 PM IST
EC Nimmagadda Ramesh Kumar Meeting With Officers Over Local Body Elections
X

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అధికారులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు తేదీలు ఖరారు చేయనున్నారు. రేపు లేదా ఎల్లుండి సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించనున్నారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులతో ఎస్ఈసీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కానున్నారు. లోకల్ ఎలక్షన్స్ గురించి అధికారులతో చర్చించనున్నారు. ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఎలక్షన్స్ ఉంటాయని నిమ్మగడ్డ ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story