Dussehra Celebrations: విజయవాడలో ముగిసిన దసరా ఉత్సవాలు

Dussehra Celebrations Ended in Vijayawada
x

విజయవాడలో ముగిసిన దసరా వేడుకలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Dussehra Celebrations: ఘనంగా నగరోత్సవం, తెప్పోత్సవం నిర్వహించిన అర్చకులు

Dussehra Celebrations: విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి అంకం ఘనంగా ముగిసింది. విజయదశమి రోజున రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమివ్వగా సాయంత్రం నగరోత్సవం, తెప్పోత్సవం నిర్వహించారు. మల్లేశ్వరస్వామి ఆలయం నుంచి నగరోత్సవం ప్రారంభం కాగా ఉత్సవమూర్తులను దుర్గాఘాట్‌ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత హంస వాహనంపై దుర్గా మల్లేశ్వరులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అయితే వరద కారణంగా ఈ ఏడాది తెప్పోత్సవం జలవిహారం లేకుండా ముగిసింది. ఇక హంసవాహనసేవ అనంతరం అర్చకులు కృష్ణానదికి హారతులిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories