Dhulipalla Narendra: ఏపీ గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మారింది

Dhulipalla Narendra says that  YCP Leaders have Relation with Drug Affair
x

ధూళిపాళ్ల నరేంద్ర (ఫైల్ ఫోటో)

Highlights

*గతనెల 20న హెరాయిన్ పట్టుబడితే..నిన్న సీఎం మాట్లాడమేంటి? *ఆషీ ట్రేడింగ్ సంస్థ వెనకున్న వైసీపీ నేతలెవో తేలాలి : ధూళిపాళ్ల

Dhulipalla Narendra: ఏపీలో గంజాయి, డ్రగ్స్ దందా తారస్థాయికి చేరిందని టీడీపీ ఆరోపించింది. ఈ దందాతో ప్రమేయమున్న వైసీపీ నేతలను రక్షించేందుకు డీజీపీ, సీపీ అష్టకష్టాలు పడుతున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. శాంతి,భద్రతలను కాపాడాల్సిన పోలీసులు వైసీపీ నేతలను కాపాడాలని తహతహ లాడుతున్నారన్నారు.

గత నెల 20 న హెరాయిన్ పట్టుబడితే నిన్న సీఎం ఆ అంశంపై మాట్లాడటం దారుణమన్నారు. ఏపీలో గంజాయి సాగులో వైసీపీ నేతల హస్తం ఉందని ఒక పెద్ద మాఫియా ఏపీలో నడుస్తుందనీ దుయ్యబట్టారు ఆషీ ట్రేడింగ్ సంస్థకు చెందిన సుధాకర్ వెనుక ఉన్న వైసీపీ పెద్దలు ఎవరో తేలాలని నరేంద్ర డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories