పంచాయతీరాజ్ ఉద్యోగులతో రేపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ: 'మాటా-మంతి' ద్వారా దిశా నిర్దేశం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ రేపు (బుధవారం, డిసెంబర్ 10, 2025) తన శాఖ ఉద్యోగులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Arun Chilukuri
Published on: 9 Dec 2025 2:23 PM IST
పంచాయతీరాజ్ ఉద్యోగులతో రేపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ: మాటా-మంతి ద్వారా దిశా నిర్దేశం
X

పంచాయతీరాజ్ ఉద్యోగులతో రేపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ: 'మాటా-మంతి' ద్వారా దిశా నిర్దేశం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ రేపు (బుధవారం, డిసెంబర్ 10, 2025) తన శాఖ ఉద్యోగులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. 'మాటా-మంతి' పేరుతో ఈ సమావేశం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో జరగనుంది. ఈ భేటీకి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు రెండు వేల మంది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు హాజరుకానున్నారు.

ఉద్యోగులతో మాట్లాడనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించే దిశగా వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. పదోన్నతులతో ఉత్సాహంగా ఉన్న ఉద్యోగులందరినీ సమాయత్తం చేసి, ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునివ్వనున్నారు.

పంచాయతీరాజ్ శాఖలో గత 17 నెలల కాలంలో అనేక సంస్కరణలు అమలు చేశామని, పాలనలో పారదర్శకత పెంచడం కోసం 'స్వర్ణ పంచాయతీ' పోర్టల్‌ను కూడా ప్రారంభించామని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది.

ఈ సమావేశం ద్వారా క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను తెలుసుకుని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వారిని కార్యోన్ముఖులను చేయాలని పవన్ కల్యాణ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story