దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్‌

Arun Chilukuri
Published on: 30 Sept 2020 10:26 AM IST
దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్‌
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల్ని ఈ మహమ్మారి వదలడం లేదు. ఇటీవల ఏపీలో ఎంపీలు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆమెహైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమె కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. ఆమెకు కొవిడ్‌-19 సోకిందని వైద్యులు గుర్తించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story