Tirupati: రుయా ఆసుపత్రిలో 23 మంది చనిపోయారు..పేర్లు వెల్ల‌డించిన నారాయణ‌

CPI Narayana
x

సీపీఐ నారాయణ 

Highlights

Tirupati: తిరుప‌తిలోని రుయా ఆసుపత్రిలో ప్రాణవాయువు అందక క‌రోనా రోగులు మృతి చెందిన విష‌యం తెలిసిందే.

Tirupati: తిరుప‌తిలోని రుయా ఆసుపత్రిలో ప్రాణవాయువు అందక క‌రోనా రోగులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. మరణిచిన వారి సంఖ్యను ప్రభుత్వం తప్పుగా వెల్లడించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ విమర్శించారు. వాస్తవానికి 23 మంది చనిపోగా ప్రభుత్వం కేవలం 11మంది మరణించారని అసత్యం చెబుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా చనిపోయిన వారి పేర్లను సైతం నారాయణ వెల్లడించారు. కొవిడ్ బాధితులను సురక్షితంగా వైద్యం అందించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఘాటుగా విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం మృతుల సంఖ్యపై వాస్తవాలను చెప్పడం లేదని నారాయణ విమ‌ర్శించారు. ఆక్సిజన్ ట్యాంకర్లను రెండ్రోజుల ముందే తెప్పించుకోవాలనే విషయం ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. ఆక్సిజన్ ఇవ్వాల్సిన విషయంలో కేంద్రాన్ని జగన్ ఎందుకు నిలదీయలేకపోతున్నారని ప్రశ్నించారు. వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలకు కూడా వైసీపీ నేతలు కులాలను ఆపాదిస్తున్నారని చెప్పారు. కేంద్రాన్ని నిలదీయడం చేతకాక ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేస్తారా? అని మండిపడ్డారు. వైసీపీ నేతల కల్యాణమండపాలను కోవిడ్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు.

అయితే మొత్తం 11 మంది చనిపోయినట్టు ప్రభుత్వం చెపుతోంది. అయితే ఈ లెక్కలు కరెక్ట్ కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మృతుల విషయంలో ప్రభుత్వం అసత్యాలు చెపుతోందని విమర్శించారు. మొత్తం 23 మంది చనిపోయారని అన్నారు. మేశ్ బాబు, రామారావు, జయచంద్ర, కె.బాలు, భువనేశ్వర్ బాబు, రమణాచారి, కలందర్, గజేంద్రబాబు, షాహిద్, మహేంద్ర, ప్రభాకర్, తనూజారాణి, వెంకట సుబ్బయ్య, పజులాల్, రామారావుపుష్పలత, గౌడ్ బాషా, వేణుగోపాల్, మదన్మోహన్ రెడ్డి, దేవేంద్రరెడ్డి, రాజమ్మ, సుబ్రహ్మణ్యం, సులోచన అనే వ్యక్తులు చనిపోయారని ఆయన చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories