
ఏపీలో కొత్తగా 289 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కొత్తగా 289 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 51,207 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 42, చిత్తూరు 40, విశాఖపట్నం జిల్లాల్లో 40 కేసులు గుర్తించారు. , విజయనగరం జిల్లాలో 9 కేసులు నిర్థారణ అయ్యాయ. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 7, శ్రీకాకుళం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 428 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 2,896 మంది చికిత్స పొందుతున్నారు. కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 7,125కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,83,876 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,73,855 మంది కరోనా నుంచి కోలుకుని డిశార్జ్ అయ్యారు.
#COVIDUpdates: 06/01/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 6, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,80,981 పాజిటివ్ కేసు లకు గాను
*8,70,960 మంది డిశ్చార్జ్ కాగా
*7,125 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,896#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/vau9vHssWH

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire