ఏపీలో వాలంటీర్ కు కరోనా.. పూర్తిస్థాయిలో వైరస్ వ్యాప్తి

ఏపీలో వాలంటీర్ కు కరోనా.. పూర్తిస్థాయిలో వైరస్ వ్యాప్తి
x
Highlights

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కట్టడి చేస్తున్నా కరోనా మరింత వేగంగా వ్యాపిస్తోంది, ప్రధానంగా కరోనా సోకినవారికి వైద్య ఇతర సేవలు అందిస్తున్న వారికి మరింతగా వ్యాప్తి చెందుతోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కట్టడి చేస్తున్నా కరోనా మరింత వేగంగా వ్యాపిస్తోంది, ప్రధానంగా కరోనా సోకినవారికి వైద్య ఇతర సేవలు అందిస్తున్న వారికి మరింతగా వ్యాప్తి చెందుతోంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు వైద్యులు, పోలీసులే కాకుండా కొత్తగా ఏపీలో గ్రామస్థాయిలో సేవలందిస్తున్న వాలంటీర్లను విడిచిపెట్టడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఒక వాలంటీర్కు కరోనా సోకినట్లు అధికారుల విచారణలో తేలింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కరోనావైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా కోవిడ్ కేసులు ఎక్కువగానే నమోదవుతూన్నాయి. కాగా తాజాగా ఏపీలోని వాలంటీర్‌కు కరోనా వైరస్ సోకింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని వాలంటీర్‌కు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో వాలంటీర్‌ కుటుంబ సభ్యులను కూడా టెస్టులు చేస్తున్నారు అధికారులు. అలాగే వాలంటీర్ ఎక్కడెక్కడ విధులు నిర్వహించారో.. ఎవరెవరిని కలిశారో.. అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,986 శాంపిల్స్‌ను పరీక్షించగా 98 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,377కి చేరింది. మరో 29 మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 1,033 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,273 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 71కి చేరింది. ఇవాళ నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 43 మందికి కరోనా నిర్థారణ అయ్యింది

Show Full Article
Print Article
More On
Next Story
More Stories