AP Secretariat: ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం

Corona Tention at Andhra Pradesh Secretariat
x

ఆంధ్రప్రదేశ్ సచివాలయం (ఫైల్ ఫొటో)

Highlights

Andhra Pradesh: ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వైరస్‌ బారిన పడి ఎస్‌వో అజయ్‌బాబు మృతి చెందారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వైరస్‌ బారిన పడి లేబర్‌ డిపార్ట్‌మెంట్ ఎస్‌వో అజయ్‌బాబు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో సచివాలయంలో ఐదుగురు ఉద్యోగులు మృత్యువాత పడ్డారు.

దీంతో సెక్రటేరియట్‌ ఎంప్లాయిస్‌ భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా.. తమకు వర్క్‌‌ ఫ్రమ్‌ హోమ్‌కు ప్రభుత్వం అనుమతివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ఏపీలో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. మరోవైపు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్ధులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories