ఏపీలో అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్‌ విడుదల

ఏపీలో అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్‌ విడుదల
x
Highlights

దేశంలో రోజుకు 70 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నప్పటికీ.. ఇప్పుడిప్పుడే ప్రజల జీవన విధానం సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఈ క్రమంలో..

దేశంలో రోజుకు 70 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నప్పటికీ.. ఇప్పుడిప్పుడే ప్రజల జీవన విధానం సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఈ క్రమంలో అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి రానున్న ఆన్‌లాక్‌ 5 మార్గదర్శకాలను పదిరోజుల కిందట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో దాదాపు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది.

అలాగే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధిదంచిన అన్‌లాక్‌ 5.0 గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గైడ్ లైన్స్ ప్రకారం రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి అని పేర్కొంది. సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా ప్రజారవాణాలో పాటించాలని, అలాగే గుళ్ళు, చర్చిలు, మసీదులలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్ తర్వాత శానిటైజేషన్ చేసుకునేలా యాజమాన్యాలకు ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది. స్కూళ్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోట కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సినిమా హాల్స్‌లో కోవిడ్ నిబంధనలపై టెలీ ఫిల్మ్ ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాని వెల్లడించింది. మాస్క్‌ లేకుంటే షాపింగ్ మాల్స్‌, సినిమా హాల్స్‌లో ప్రవేశం నిరాకరించాలని తెలిపింది. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో మాస్క్‌లు ధరించేలా అందరికి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది, ఇందులో భాగంగా ప్రజలకు మైక్ అనౌన్స్‌మెంట్ చేయాలని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories