Nandyal: టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని హత్యచేసేందుకు కుట్ర

Nandyal: టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని హత్యచేసేందుకు కుట్ర
x
Highlights

ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి హత్యచేసేందుకు పన్నిన కుట్రను కడప చిన్నచౌక్ పోలీసులు భగ్నం చేశారు.

నంద్యాల: ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి హత్యచేసేందుకు పన్నిన కుట్రను కడప చిన్నచౌక్ పోలీసులు భగ్నం చేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ, కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డకు చెందిన రాజకీయ నేత ఏవీ సుబ్బారెడ్డిని హత మార్చేందుకు 50 లక్షలకు ముగ్గురు నిందితులు డీల్ కుదుర్చుకున్నారని, వీరు కర్నూలు జిల్లాకు చెందిన వారేనని పేర్కొన్నారు. కడపలో హత్యకు ప్రణాలిక రూపొందిస్తున్న సమయంలో చాకచక్యంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

వీరి వద్ద నుండి3.20 లక్షల రూపాయల నగదు, ఒక పిస్టల్, 6 తూటాలు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో సంజురెడ్డి అనే నిందితుడు సూడో నక్సలైట్ గా విచారణలో వెల్లడైందన్నారు. ఇప్పటికే రెండుసార్లు హైదరాబాద్ లోని ఏవి సుబ్బారెడ్డి ఇంటికి రెక్కి నిర్వహించారని,ఆ సమయంలో హైదరాబాద్ పోలీసులకు భయపడి నిందితుడు వెనక్కు వచ్చినట్లు తెలిపారు. నిందితులపై గతంలో పలు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories