Krishnapatnam: ఐసీఎంఆర్ ప్రతినిధుల పర్యటనపై అయోమయం

Confusion Prevails over ICMR visit to Krishnapatnam
x

Krishnapatnam: ఐసీఎంఆర్ ప్రతినిధుల పర్యటనపై అయోమయం

Highlights

Krishnapatnam: దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు నెల్లూరు కృష్ణపట్నం వైపే.

Krishnapatnam: దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు నెల్లూరు కృష్ణపట్నం వైపే. ఆనందయ్య ఆయుర్వేద మందు కరోనాపై పనిచేస్తుందా లేదా అనే అంశం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఈ విషయంపై అధ్యయనం చేసేందుకు ఇవాళ ఐసీఎంఆర్ ప్రతినిధుల బృందం కృష్ణపట్నంలో పర్యటించనున్నారు.

ఐసీఎంఆర్ నివేదికపైనే ఆనందయ్య మందు వినియోగించాలా వద్దా అనే విషయంపై క్లారిటీ రానుంది. దీంతో ఐసీఎంఆర్ నివేదికపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనం. అయితే ఇవాళ ఐసీఎంఆర్ బృందం అధ్యయనానికి వస్తుందా.. లేదా.. అనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు తమకు ఐసీఎంఆర్ పర్యటనపై ఎలాంటి సమాచారం అందలేదంటున్నారు జిల్లా అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories