Sankranthi Special: తూ.గో. జిల్లాలో కోడి పందాలు షురూ
* పర్మిషన్ లేకున్నా.. పక్కాగా ఏర్పాట్లు * పర్మిషన్తో పనిలేదంటున్న నిర్వాహకులు * అమలాపురం, రాజమండ్రి ఏజెన్సీ ప్రాంతాల్లో కోడి పందాలు
Representational Image
తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు షురూ అయ్యాయి. పర్మిషన్లేకున్నా పక్కాగా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. అమలాపురం, రాజమండ్రి, ఏజెన్సీ ప్రాంతాల్లో యధేచ్చగా కోడిపందాలు కొనసాగుతున్నాయి. పోలీసుల ఆదేశాలను నిర్వహకులు తుంగలోకి తొక్కేసి కోళ్ల పందాలను ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో సాంప్రదాయ కోడి పందాల చాటున పేకాట, గుండాట నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయనేతల ఒత్తిడి కారణంగా పోలీసులు చేతులెత్తేశారని పలువురు విమర్శిస్తున్నారు.
Next Story




