100 ఈ-బస్ సర్వీసులను ప్రవేశపెడుతున్న ఆర్టీసీ.. నేడు అలిపిరిలో ప్రారంభించనున్న సీఎం జగన్
![](/images/authorplaceholder.jpg?type=1&v=2)
![CM YS Jagan will Start Electric Bus Services in Tirumala Tirupati CM YS Jagan will Start Electric Bus Services in Tirumala Tirupati](https://assets.hmtvlive.com/h-upload/2022/09/27/342148-andhra-pradesh-1.webp)
100 ఈ-బస్ సర్వీసులను ప్రవేశపెడుతున్న ఆర్టీసీ.. నేడు అలిపిరిలో ప్రారంభించనున్న సీఎం జగన్
*తొలుత తిరుమల ఘాట్ రోడ్డులో 10 ఈ-బస్సులు
Andhra Pradesh: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల - తిరుపతిని కేంద్రంగా చేసుకుని తొలిసారిగా ఎలక్ట్రికల్ బస్సులను APSRTC ప్రవేశపెడుతోంది. తిరుమల, తిరుపతిలో 100 ఈ-బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి విడతలో 10 ఎలక్ట్రికల్ బస్సులను ఇవాళ సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అనంతరం దశల వారీగా డిసెంబర్ నాటికి 100 ఈ-బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. అందులో భాగంగా తిరుమల- తిరుపతి కనుమ దారిలో 50 బస్సులు, రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకు 14 బస్సులు, తిరుపతి నుంచి నెల్లూరు 12 బస్సులు, తిరుపతి- కడప రూట్లో 12, తిరుపతి- మదనపల్లె రూట్లో మరో 12 బస్సులు నడపనున్నారు. ఎలక్ట్రికల్ ఏసీ బస్సు టికెట్ ధర సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
![](/images/logo.png)
About
![footer-logo](/images/logo.png)
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire