కరోనా వైరస్ పట్ల ప్రజల్లో భయం తొలగించాలి : సీఎం వైఎస్ జ‌గ‌న్

కరోనా వైరస్ పట్ల ప్రజల్లో భయం తొలగించాలి : సీఎం వైఎస్ జ‌గ‌న్
x
YS Jagan (File Photo)
Highlights

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ వేగ‌వంతం చేయాలని సీఎం వైఎస్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. అకాల వర్షాలు సంభవిస్తే మార్కెట్లలో... రైతులకు నష్టం జరగకుండా...

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ వేగ‌వంతం చేయాలని సీఎం వైఎస్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. అకాల వర్షాలు సంభవిస్తే మార్కెట్లలో... రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. తమిళనాడులోని కోయంబేడు నాలుగు జిల్లాలపై ప్రభావం చూపుతోందనగా.. రైతులకు నష్టం జరగకుండా చూడాలని జగన్ ఆదేశించారు.

కరోనా నివారణ చర్యలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, రాష్ట్ర‌ డీజీపీ గౌతవం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కెఎస్‌.జవహర్‌ రెడ్డితోపాటు ప‌లువురు అధికారులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ..కరోనా వైరస్ పట్ల ప్రజల్లో ఉన్న భయం, ఆందోళన తొలగించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వైరస్‌ సోకిన వారి పట్ల వివక్ష చూపడం సరి కాదని, ల‌క్ష‌ణాలు ఉన్నవారు చికిత్స చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఎం జ‌గ‌న్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కరోనో కేసులుపై సీఎం ఆరా తీశారు.

మంగ‌ళ‌వారం ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ విష‌య‌మై చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు అధికారులు సీఎం జగన్ చేసిన ప్రసంగంపై ప్రశంసలు వస్తున్నాయని ప్రస్తావించారు. కరోనా వైరస్‌ పట్ల భయాందోళనలు తొలగించాల్సిన ఉంద‌ని చెప్పిన మాట‌పై ప్రతి ఒక్కరూ మద్దతు పలుకుతున్నారని అధికారులు చెప్పారు. కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జైన ఓ ఉద్యోగిని ఇంట్లోకి రానీయలేదన్న విష‌యాన్ని అధికారులు సీఎం వ‌ద్ద పలువ‌రు అధికారులు ప్ర‌స్తావించారు. కరోనా పట్ల తీవ్ర భయాందోళనలు కారణంగా.. ఇలాంటి వివక్ష చూపిన ఘటనలు జరుగుతున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. క‌రోనా కేసులు ఆరా తీయ‌గా.. ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని 60 ఏళ్ల పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై దృష్టి పెట్టామని అధికారులు సీఎంకు వివ‌రించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories