ఏపీ టీడీపీ నేతను పరామర్శించిన సీఎం కేసీఆర్

ఏపీ టీడీపీ నేతను పరామర్శించిన సీఎం కేసీఆర్
x
Highlights

కొంతకాలంగా అస్వస్థతకు గురైన తన స్నేహితుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. హైదరాబాద్‌...

కొంతకాలంగా అస్వస్థతకు గురైన తన స్నేహితుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని గోపాల కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లిన కేసీఆర్‌.. ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం జాగ్రత్త అంటూ సూచన చేశారు. అనంతరం తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయా పరిణామాలపై కేసీఆర్‌, బొజ్జల మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కుమార్‌ను బొజ్జల కుటుంబ సభ్యులకు పరిచయం చేశారు కేసీఆర్.

గోపాల కృష్ణారెడ్డి తన కుటుంబ సభ్యులను కూడా కేసీఆర్‌ కు పరిచయం చేశారు. వారిని ఆత్మీయంగా పలుకరించారు కేసీఆర్. అనంతరం సీఎంను వారు శాలువాతో సత్కరించారు. అందరూ కలిసి గ్రూపు ఫోటో దిగారు. కాగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి. పార్టీని స్థాపించినప్పటినుంచే ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. కొంతకాలం టీడీపీలో ఉన్న కేసీఆర్.. ఆ తరువాత తెరాస ను ఏర్పాటు చేశారు. ఇటు చంద్రబాబుకు కూడా బొజ్జల సన్నిహితులు. వారిద్దరూ విద్యార్థి దశనుంచే స్నేహితులు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories