CM Jagan: నేడు విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్


CM Jagan: నేడు విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్
CM Jagan: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
CM Jagan: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇవాళ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సీఎం జగన్ దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం వద్దకు చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఇక ఇంద్రకీలాద్రిపై దసరా శోభ కనిపిస్తోంది. దసరా నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మూలానక్షత్రం సందర్భంగా భక్తులు భారీగా పోటెత్తుతారని ఆలయ అధికారులు అంచనా వేసి.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire