కోవిడ్ పై సీఎం జగన్ సమీక్ష.. ఇవి ఖచ్చితంగా ఉండాలి..

కోవిడ్ పై సీఎం జగన్ సమీక్ష.. ఇవి ఖచ్చితంగా ఉండాలి..
x
Highlights

రాష్ట్రంలో కోవిడ్‌ –19 పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం..

రాష్ట్రంలో కోవిడ్‌ –19 పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కోవిడ్ ‌ఆస్పత్రుల్లో ప్రస్తుతం 37,441 బెడ్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. అలాగే ఇవ్వాళ్టికి సాధారణ బెడ్లు 2,462, ఆక్సిజన్‌ సపోర్టుతో ఉన్న బెడ్లు 11,177, ఐసీయూ బెడ్లు 2,651 ఇంకా ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

కోవిడ్‌ ఆస్పత్రుల్లో తాత్కాలిక నియామకాలపై వివరాలు అందించారు అధికారులు. మొత్తం 30,887 పోస్టులకు గానూ 21,673 తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయాలనీ నిర్ణయించారు. ఇక రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌లో 9,971 పోస్టులు అందులో 4,676 పోస్టులు నియామకం చేస్తుండగా, 5,295 పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది. మరో 10 రోజుల్లో ఈ పోస్టుల భర్తీ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. కోవిడ్ కట్టడి కోసం‌ ప్రస్తుతం ప్రతిరోజూ రూ. 10.18 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సీఎం అన్నారు. ఇందులో కోవిడ్‌ టెస్టుల కోసం రూ. 4.3 కోట్లు , ఆహారం కోసం రూ.1.31 కోట్లు, మందులు కోసం రూ. 4.57 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. హెల్ప్‌ డెస్క్‌లను ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో పెట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇక ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేలా ఆస్పత్రులు వ్యవహరిస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్‌ ఆస్పత్రులపై ఎలాంటి సమీక్ష చేస్తున్నామో అలాగే.. అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు, ఎంపానల్డ్‌ ఆస్పత్రులపై సమీక్ష చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రోగులకు వైద్యం సరిగ్గా అందలేదంటే వారిని సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్యమిత్రలదేనని సీఎం స్పష్టం చేశారు. ప్రతిరోజూ అధికారులు కాల్‌ సెంటర్లకు మాక్‌ కాల్‌ చేసి పనితీరును పరిశీలించాలని.. ప్రతి మాక్‌ కాల్‌పై వస్తున్న రెస్పాన్స్‌ను రికార్డు చేయాలని అన్నారు. ఆహారం, శానిటేషన్, డాక్టర్లు, మౌలికసదుపాయాలు.. ఈ నాలుగు పారామీటర్స్‌ మీద ప్రశ్నలు వేసి.. రోగులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories