మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలో కొత్త పథకం

మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలో కొత్త పథకం
x

మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలో కొత్త పథకం

Highlights

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 7 నుంచి 12 తరగతి...

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 7 నుంచి 12 తరగతి విద్యార్ధినులకు శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఉచిత శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ పథకం ప్రారంభించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

ఏప్రిల్ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సీఎం వివరించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్రభుత్వ స్కూల్స్, జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినిలకు శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 1 నుంచి ప్రతినెలా ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నేప్‌కిన్స్‌ను ప్రభుత్వం‌ పంపిణీ చేస్తుందన్నారు. ఇందు కోసం సుమారు రూ. 41.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories