CM Jagan: రైతులకు అన్ని విధాలా అండగా ఉంటున్నాం

CM Jagan Releases input Subsidy Funds to Farmers | AP News Today
x

CM Jagan: రైతులకు అన్ని విధాలా అండగా ఉంటున్నాం

Highlights

CM Jagan: ఏ సీజన్‌ పంటనష్టాన్ని అదే సీజన్‌లో పరిహారం అందిస్తున్నాం

CM Jagan: రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటున్నామని అన్నారు ఏపీ సీఎం జగన్. గతేడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో పంట నష‌్టపోయిన రైతులు ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీని జమ చేశారు. 5.97 లక్షల మంది రైతులకు 542.06 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని సీఎం జగన్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వర్షాలు సంవృద్ధిగా కురుస్తున్నాయని చెప్పారు. ఇక పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం అందిస్తున్నామని, అయితే గత ప్రభుత్వ హయాంలో అరకొరగా సాయం అందేదని సీఎం జగన్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories