ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. ఏపీలో ఇక బార్లకి చెక్

ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. ఏపీలో ఇక బార్లకి చెక్
x
Highlights

ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష చేపట్టారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులను...

ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష చేపట్టారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులను అధికారలు సీఎంకు వివరించారు. ఈ మేరకు మద్య నియంత్రణలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి . బార్ల సంఖ్యను తగ్గించాలని, ఈ విధానం జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని, బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు వహించాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే బార్లు ఉండాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories