CM Jagan: వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్‌ లేఖ

CM Jagan: రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా ఉందని లేఖలో వెల్లడి * అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నది మా నిర్ణయం: సీఎం

Sandeep Eggoju
Published on: 22 May 2021 6:09 PM IST
CM Jagan Letter to Prime Minister Modi on Vaccination
X
పీఎం మోడీ &సీఎం జగన్ (ఫోటో ది హన్స్ ఇండియా)

CM Jagan: ఏపీలో వ్యాక్సిన్‌ కొరతపై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ మరో లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ నిర్ణయమని, వ్యాక్సిన్ కొరత వల్ల ప్రస్తుతం 45 ఏళ్లకు పైబడిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించలేకపోయామని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదని, ఈ చర్య తప్పుడు సంకేతాలు ఇస్తోందని సీఎం జగన్ తన లేఖలో అభిప్రాయపడ్డారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ ధర నిర్ణయిస్తున్నాయని, ఒక్కో వ్యాక్సిన్ డోసును రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తున్నాయని ప్రధానికి తెలిపారు. వ్యాక్సిన్ పై ప్రభుత్వ నియంత్రణ లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తారని ఆందోళన వెలిబుచ్చారు. దీనివల్ల సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వివరించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story