నిర్వాసితులకు న్యాయం చేస్తాం : సీఎం జగన్

నిర్వాసితులకు న్యాయం చేస్తాం : సీఎం జగన్
x
Highlights

ఏపీ సీఎం జగన్‌ పోలవరం పర్యటన కొనసాగుతోంది. ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు సీఎం జగన్‌. అంతకు ముందు ఏరియల్‌ సర్వే నిర్వహించిన సీఎం స్పిల్‌ వే,...

ఏపీ సీఎం జగన్‌ పోలవరం పర్యటన కొనసాగుతోంది. ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు సీఎం జగన్‌. అంతకు ముందు ఏరియల్‌ సర్వే నిర్వహించిన సీఎం స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులను పరిశీలించారు. మరోవైపు నిర్మాణ పనులపై పూర్తి వివరాలను సీఎం జగన్‌కు అధికారులు వివరించారు.

ఇక ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన సీఎం జగన్ అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2022 ఖరీఫ్‌ నాటికి పోలవరం ద్వారా నీళ్లు అందిస్తామన్నారు. ఆర్థిక పరమైన అంశాలను పరిష్కరిస్తామన్న సీఎం నిర్వాసితులందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories