CM Jagan: విద్యాశాఖ ప్రమాణాలపై సీఎం జగన్ ఫోకస్

CM Jagan: ఇంటర్మీడియట్‌లోనూ బైజూస్ పాఠ్యాంశాల ప్రణాళిక

Jyothi
Published on: 9 Jun 2023 7:16 AM IST
CM Jagan Focus on Education Standards
X

CM Jagan: విద్యాశాఖ ప్రమాణాలపై సీఎం జగన్ ఫోకస్

CM Jagan: సెప్టెంబర్ నెలాఖరు కల్లా రాష్ట్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన విద్యాశాఖపై సమీక్షించారు. పిల్లల డ్రాపవుట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కాలేజీలు ఉండాలని , వచ్చే జూన్ నాటికి ఈ కళాశాలలు ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. ఇంటర్మీడియట్లో కూడా బైజూస్‌ కంటెంట్‌ పెట్టేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం...తర్వాత దశలో ట్యాబులు పంపిణీకి సన్నద్దమవ్వాలని ఆదేశించారు. కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు.

Jyothi

Jyothi

Next Story