CM Jagan: విగ్రహాల ధ్వంసంపై మరోసారి సీఎం జగన్ ఘాటు వ్యా‌ఖ్యలు

Arun Chilukuri
Published on: 5 Jan 2021 3:11 PM IST
CM Jagan: విగ్రహాల ధ్వంసంపై మరోసారి సీఎం జగన్ ఘాటు వ్యా‌ఖ్యలు
X

CM Jagan: ఏపీలోని ఆలయాలు, విగ్రహాల దాడిపై సీఎం జగన్‌ ఫైరయ్యారు. భయం, భక్తి లేకుండా దేవుడి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సంక్షేమ ఫలాలు అందిస్తుంటే జీర్ణించుకోలేక దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తున్నవారి ఆటకట్టిస్తామన్నారు ఆయన. మతాలు, కులాల మధ్య ద్వేషాలు పెంచేవారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇకపై దేవాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి ర‌క్షించుకునే కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇక మతసామరస్యం గురించి మాట్లాడే మాటలు పబ్లిసైజ్‌ కావాలన్నారు సీఎం జగన్‌. రాజకీయ గొరిల్లా వార్‌ఫేర్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సీఎం జగన్‌.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story