రామతీర్థం ఘటనపై సీఐడీ దర్యాప్తు వేగవంతం

Arun Chilukuri
Published on: 5 Jan 2021 7:45 PM IST
రామతీర్థం ఘటనపై సీఐడీ దర్యాప్తు వేగవంతం
X

రామతీర్ధం సంఘటనా స్థలాన్ని సీఐడీ అడిషనల్‌ డీజీ సునీల్‌ కుమార్‌ పరిశీలించారు. రామతీర్థం ఘటన జరిగిన విధానం చూస్తుంటే ఎవరో కావాలనే చేసినట్టు ఉందని ఆయన తెలిపారు. లబ్ది కోసం.. కక్ష కోసం దాడులు చేస్తారని చెప్పారు. ప్రభుత్వంపై కక్షతోనే ఈ ఘటనకు పాల్పడ్డారని తెలిపారు. తలను ఖండించడానికి ఉపయోగించిన రంపం దొరికిందన్నారు. చాలా ఆదారాలు సేకరించామని పేర్కొన్నారు. రాజకీయాలు చేయడానికే ఘటనకు పాల్పడ్డారన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని దోషులను వెంటనే పట్టుకుంటామని సీఐడీ అడిషనల్‌ డీజీ సునీల్‌ కుమార్‌ చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story