Chandrababu: చికెన్‌ కొట్టులోనూ వైసీపీ ఎమ్మెల్యే వసూళ్లు..

Chandrababu: టీడీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు 12వేల కోట్లు ఖర్చు చేశామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.

Arun Chilukuri
Published on: 2 Aug 2023 5:11 PM IST
Chandrababu Road Show in Jammalamadugu
X

Chandrababu: చికెన్‌ కొట్టులోనూ వైసీపీ ఎమ్మెల్యే వసూళ్లు..

Chandrababu: టీడీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు 12వేల కోట్లు ఖర్చు చేశామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్‌ కేవలం 2వేల కోట్లే ఖర్చు చేశారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు..జమ్మలమడుగు సర్కిల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చికెన్‌ కొట్టులోనూ వసూళ్లకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. సీఎం జగన్‌కు ప్రజలను దోచుకోవాలనే తప్ప.. మేలు చేయాలనిలేదని విమర్శించారు. జగన్‌ కొత్తగా ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా? ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు. జమ్మలమడుగు ప్రజల కోసం టీడీపీ నేత భూపేష్‌ పనిచేస్తారని చంద్రబాబు చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story