ఏపీకి రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం !

ఏపీకి రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం !
x
Highlights

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను శుక్రవారం విడుదల చేసింది. ఆర్థిక సమస్యల్లో ఉన్న ఏపీకి కొంత ఊరట లభించినట్టైంది. 15వ ఆర్థిక సంఘం...

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను శుక్రవారం విడుదల చేసింది. ఆర్థిక సమస్యల్లో ఉన్న ఏపీకి కొంత ఊరట లభించినట్టైంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రెవెన్యూ లోటు నిధులను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు సంబంధించి రూ. 6,195.08 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందులో ఏపీకి రూ. 491.41 కోట్లను రిలీజ్ చేసింది. 2020 నుంచి 2025 మధ్య కాలానికి గాను రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాను ఆర్థిక సంఘం తేలుస్తుంది. వివిధ రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసిన రెవెన్యూ లోటు నిధుల విడుదల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.






Show Full Article
Print Article
Next Story
More Stories