Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ సంచలన వ్యాఖ్యలు.. కోర్టు ఆదేశాలిస్తే దర్యాప్తు కొనసాగిస్తాం- సీబీఐ

Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది.

Arun Chilukuri
Published on: 16 Sept 2025 3:52 PM IST
Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ సంచలన వ్యాఖ్యలు.. కోర్టు ఆదేశాలిస్తే దర్యాప్తు కొనసాగిస్తాం- సీబీఐ
X

Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. ఈ సందర్భంగా కేసు దర్యాప్తును కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కోర్టుకు తెలిపింది. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తును కొనసాగిస్తామని పేర్కొంది.

అయితే, నిందితుల బెయిల్ రద్దు అంశంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో కేసులో తదుపరి విచారణ ట్రయల్ కోర్టు పరిధిలోకి వెళ్లనుంది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో అనేక మలుపులు తిరిగింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టినప్పటి నుంచి పలువురు నిందితులను అరెస్ట్ చేయడం, వారికి బెయిల్ లభించడం వంటి అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు సీబీఐ చేసిన తాజా ప్రకటన కేసు విచారణలో మరో కీలక పరిణామంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story