ఆర్టీసీ బస్సులో కరోనా టెన్షన్‌.. బస్సును ఆపేయాలని కోరిన ప్రయాణికులు

ఆర్టీసీ బస్సులో కరోనా టెన్షన్‌.. బస్సును ఆపేయాలని కోరిన ప్రయాణికులు
x
ఆర్టీసీ బస్సులో కరోనా టెన్షన్
Highlights

పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సులో కరోనా అనుమానంతో మహిళా కండక్టర్‌ను ప్రయాణికులు ఆస్పత్రిలో చేర్పించారు. తెలంగాణ నుంచి సత్తుపల్లి, ఏలూరు వస్తున్న...

పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సులో కరోనా అనుమానంతో మహిళా కండక్టర్‌ను ప్రయాణికులు ఆస్పత్రిలో చేర్పించారు. తెలంగాణ నుంచి సత్తుపల్లి, ఏలూరు వస్తున్న ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్‌కు జలుబు, జ్వరం ఉండటంతో బస్సును ఆపేయాలని కోరారు ప్రయాణికులు. చింతలపూడి ప్రభుత్వాస్పత్రి వద్ద బస్సును నిలిపివేశారు. అనంతరం మహిళా కండక్టర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. మరో బస్సులో ప్రయాణికులను తరలించారు.

ఆరోగ్యం నిలకడగా ఉందని రెండు రోజులు పర్యవేక్షణలో ఉంచుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఏపీలో ఇప్పటివరకు అనేక మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎవరికీ కరోనా సోకినట్టు నిర్థారణ కాలేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్యులు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూనే అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories