Srisailam: శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో ప్రహారీ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

Srisailam: లోయ వద్ద ప్రహారీగోడను ఢీకొట్టి నిలిచిపోయిన బస్సు

Jyothi
Published on: 29 Jan 2023 5:24 PM IST
Bus Accident at Srisailam Ghat Road
X

Srisailam: శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో ప్రహారీ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

Srisailam: శ్రీశైలం డ్యాం ఘాట్‌ రోడ్‌ వద్ద పెను ప్రమాదం తప్పింది. డ్యాం మలుపు దగ్గర అదుపుతప్పి ప్రహారీగోడను టీఎస్‌ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. డ్యాం సమీపంలోని లోయ వద్ద ప్రహారీగోడను ఢీకొట్టి బస్సు నిలిచిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా.. బస్సు ప్రమాదంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. హుటాహుటిన బస్సులో నుంచి కిందకు దిగిపోయారు. శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Jyothi

Jyothi

Next Story