రాష్ట్రం నుండి ఏం పెట్టుబడులు వెళ్లిపోయాయో చంద్రబాబు చెప్పాలి..: మంత్రి బొత్స

రాష్ట్రం నుండి ఏం పెట్టుబడులు వెళ్లిపోయాయో చంద్రబాబు చెప్పాలి..: మంత్రి బొత్స
x
Highlights

చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు, లోకేష్‌పై ఆయన...

చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు, లోకేష్‌పై ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రం నుండి ఏం పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబును ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం ఏం చేసినా విమర్శించడం పనిగా పెట్టుకున్నారని ఆంగ్ల మాధ్యమంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఫైరయ్యారు బొత్స సత్యనారాయణ.

సింగపూర్‌ స్టార్ట్‌ ఆప్‌ ప్రాజెక్టు గత కేబినెట్‌లోనే పరస్పర అంగీకారంతో రద్దు చేయాలని నిర్ణయించామన్నారు మంత్రి బొత్స. రెండు సార్లు సింగపూర్‌ ప్రతినిధులను కలిశామని ప్రాజెక్టుపై ఉపయోగం ఏంటో వారు చెప్పలేకపోవడం వల్లే రద్దు చేసుకున్నట్లు తెలిపారు. వేరే ప్రాజెక్టులో మళ్లీ కలిసి పని చేస్తామని సింగపూర్‌ మంత్రి స్వయంగా వెల్లడించారని సింగపూర్‌ ప్రతినిధులు రాసిన లేఖను పూర్తిగా చదవకుండానే అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజధాని కట్టడాలు 90 శాతం పూర్తి అయ్యాయని అబద్ధాలు చెబుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories