రామతీర్థంలో అడుగుపెట్టే అర్హత బాబుకు లేదు: బొత్స ఝాన్సీ

Arun Chilukuri
Published on: 2 Jan 2021 5:31 PM IST
రామతీర్థంలో అడుగుపెట్టే అర్హత బాబుకు లేదు: బొత్స ఝాన్సీ
X

రామతీర్థం ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తుందని మంత్రి బొత్స మండిపడ్డారు. టీడీపీ కుట్ర పన్నుతుందని ధ్వజమెత్తారు. దేవుళ్ళ విగ్రహాలపై దాడులు చేసి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం అభివృద్ధి చేసింది తన భార్య అని బొత్స తెలిపారు. అశోక్ గజపతిరాజు ఏలాంటి అభివృద్ధి చేయలేదన్నారు మంత్రి బొత్స.

రామతీర్థంలో అడుగుపుట్టే అర్హత చంద్రబాబుకు లేదని మాజీ ఎంపీ బొత్స ఝన్సీ అన్నారు. రామతీర్థాన్ని రెండో భద్రాద్రిగా గుర్తించమని అడిగితే ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రామతీర్థం వచ్చారని విమర్శించారు. రామతీర్థం అభివృద్ధి చేసింది వైసీపీ అని అన్నారు బొత్స ఝన్సీ.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story