అనంతపురంలో వైసీపీ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అనంతపురంలో కాక రేపుతున్నాయి.

Arun Chilukuri
Published on: 26 Sept 2025 3:42 PM IST
అనంతపురంలో వైసీపీ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్
X

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అనంతపురంలో కాక రేపుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు మధ్య మాటల మంటలు పట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే బాలయ్య వ్యాఖ్యలను నిరసిస్తూ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో అనంతపురంలో ఆ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకుడు, మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మొహిద్దీన్ ఘాటుగా స్పందించారు. గత వైసిపి ప్రభుత్వంలో ఐదేళ్లు ఆ పార్టీ నేతలు, మంత్రులు వాడిన భాషను గుర్తు చేసుకోవాలని సూచించారు. బాలకృష్ణ ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనిషి అని చెప్పారు. సైకో పనులు చేశారు కాబట్టి సైకో అన్నారని చెప్పుకొచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story