Anantapuram: రైల్వే ప్యాంట్రీ సిబ్బందిపై ఏఆర్ పోలీసుల వీరంగం

Sri Sathya Sai district: గాయపడిన ప్యాంట్రీ సిబ్బందిని హిందూపురం రైల్వే ఆస్పత్రికి తరలింపు

Dhatripriya
Published on: 17 Jun 2023 12:45 PM IST
AR police Force In Sri Satyasai District
X

Anantapuram: రైల్వే ప్యాంట్రీ సిబ్బందిపై ఏఆర్ పోలీసుల వీరంగం

Sri Sathya Sai district: శ్రీసత్యసాయి జిల్లాలో ఏఆర్ పోలీసులు వీరంగం సృష్టించారు. పుట్టపర్తి వచ్చేందుకు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌లో... అనంతపురం వద్ద ప్యాంట్రీ బోగీలోకి వెళ్లారు ఏఆర్ పోలీసులు. ప్యాంట్రీ బోగీలో ప్రయాణించకూడదని సిబ్బంది సూచించారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు... మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ పోలీసులు ఎదురుదాడికి దిగారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్ రాగానే.. మరికొందరు పోలీసులతో కలిసి వంటగది బోగీ సిబ్బందిపై దాడి చేశారు. పోలీసుల దాడిలో ప్యాంట్రీ మేనేజర్ తీవ్రంగా గాయపడ్డారు.

Dhatripriya

Dhatripriya

Next Story