చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి ఘటనపై గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు

చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి ఘటనపై గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు
x
అచ్చెన్నాయుడు
Highlights

ఏపీ టీడీపీ నేతలు గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. చంద్రబాబు రాజధాని అమరావతి పర్యటన నేపథ్యంలో ఆయన కాన్వాయ్ పై దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు....

ఏపీ టీడీపీ నేతలు గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. చంద్రబాబు రాజధాని అమరావతి పర్యటన నేపథ్యంలో ఆయన కాన్వాయ్ పై దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు భద్రత, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై టీడీపీ నేతలు గవర్నర్ ‌కు ఫిర్యాదు చేశారు.

రాజధానిపై సీఎం, అతని మంత్రులు 6 నెలలు అవాస్తవాలు చెబుతూ వచ్చారని అన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. రాజధానిపై సీఎం, మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు పర్యటనపై పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నా వైసీపీ రౌడీలను అడ్డుకోలేకపోయారన్నారు. పోలీసుల కుట్రతోనే చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి జరిగిందన్న అచ్చెన్నాయుడు ఇదే విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories