కరోనా ఫండ్ కోసం బుగ్గన విన్నపాలు

కేంద్ర మంత్రి హర్షవర్థన్‎తో ఏపీ మంత్రి బుగ్గన భేటీ

Arun Chilukuri
Published on: 24 Nov 2020 6:47 PM IST
కరోనా ఫండ్ కోసం బుగ్గన విన్నపాలు
X

Buggana Rajendranath (file image)

Andhra Pradesh | కరోనా ఎమర్జెన్సీ ఫండ్స్ నుంచి ఏపీకి సహాయం చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినట్లు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ తో భేటీ అయిన బుగ్గన.. రాష్ట్రానికి 981 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. ఏపీలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచామని, కొవిడ్ కేర్ సెంటర్లను పెంచడంతో ఖర్చు పెరిగిందన్నారు. ఈ నేపధ్యంలో కరోనా ఎమర్జెన్సీ ఫండ్స్ నుంచి ఏపీకి నిధులు కేటాయించాల్సిందిగా కోరినట్లు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story