ఏపీ రాజధానిపై ప్రభుత్వం క్లారిటీ

ఏపీ రాజధానిపై ప్రభుత్వం క్లారిటీ
x
అమరావతి
Highlights

ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందో, తరలిస్తారో అన్న అనుమానాలకు తెరపడింది. ఏపీ రాజధాని మార్పుపై అనేక పుకార్లు షికారు చేశాయి. అయితే ప్రభుత్వం ఈ ఉహాగానాలకు...

ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందో, తరలిస్తారో అన్న అనుమానాలకు తెరపడింది. ఏపీ రాజధాని మార్పుపై అనేక పుకార్లు షికారు చేశాయి. అయితే ప్రభుత్వం ఈ ఉహాగానాలకు చెక్ పెట్టింది. ఈ విషయమై శాసనమండలిలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. శుక్రవారం శాసన మండలిలో ఏపీ రాజధానిపై టీడీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నలు అడిగారు. రాజధానిని మార్చే ఉద్దేశం ఉందా? అమరావతి కోసం ఇప్పటి వరకు ఖర్చుచేసిన నిధుల వివరాలేంటి? అని ప్రశ్నించడంతో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాత పూర్వక సమాధానం చెప్పారు. రాజధానిలో అమరావతిలోనే కొనసాగుతోందని ఎటూ తరలించడంలేదని స్పష్టం చేశారు. దీంతో అమరావతిలోనే రాజధాని ఉంటుందనేదానిపై క్లారిటీ వచ్చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories