నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. సీబీఐ విచారణకు ఆదేశం..

AP High Court: నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసును హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.

Arun Chilukuri
Published on: 24 Nov 2022 5:11 PM IST
AP High Court Transferred the Nellore Court Theft Case to CBI
X

నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. సీబీఐ విచారణకు ఆదేశం..

AP High Court: నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసును హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. సాక్ష్యాల ఫైల్స్ చోరీపై సీరియస్ అయిన ఉన్నత న్యాయస్థానం కేసు తదుపరి విచారణను సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ పీకె. మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా మంత్రి కాకాణికి సంబంధించిన కేసు ఫైల్స్ చోరీకి గురయ్యాయి. ఈవ్యవహారంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అధికార పార్టీ నేతలు కావాలనే తమకు సంబంధించిన ఫైల్స్ మాయం చేశారంటూ ఫిర్యాదు చేశారు. కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story