ఏపీ ప్రభుత్వం, సోలార్ కంపెనీలకు ఏపీ హైకోర్టు నోటీసులు

AP High Court Notice to AP Govt and Solar Companies
x

ఏపీ ప్రభుత్వం, సోలార్ కంపెనీలకు ఏపీ హైకోర్టు నోటీసులు

Highlights

High Court: ఏపీ ప్రభుత్వం, సోలార్ కంపెనీలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

High Court: ఏపీ ప్రభుత్వం, సోలార్ కంపెనీలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సోలార్ ఎనర్జీ అగ్రిమెంట్‌పై 4 వారాల్లో సమాధానం చెప్పాలని నోటీసులు ఇచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదాని గ్రూప్‌తో యూనిట్ 2 రూపాయల 49 పైసల చొప్పున 9 వేల మెగావాట్ల కొనుగోలుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది ప్రభుత్వం. అయితే ఈ అగ్రిమెంట్ సరైనది కాదని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ వేశారు.

బహిరంగ మార్కెట్‌లో యూనిట్ రూపాయి 99 పైసలకే దొరుకుతుందని పిటిషనర్ తెలిపారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సౌర విద్యుత్ ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వానికి, సోలార్ కంపెనీలకు, డిస్కంలకు నోటీసులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories