Eluru Corporation: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును ఏపీ హైకోర్టు కొట్టేసింది.

Arun Chilukuri
Published on: 9 March 2021 6:29 PM IST
Eluru Corporation: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
X

ఏపీ హైకోర్టు (ఫైల్ ఇమేజ్ )

Eluru Corporation: ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఫలితాలు మాత్రం ప్రకటించొద్దని ధర్మాసనం తెలియజేసింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 23కి వాయిదా వేసింది. ఈ నెల 10న జరగాల్సిన ఎన్నికపై సోమవారం సింగిల్‌ బెంచ్‌ స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆ స్టేను ఎత్తివేస్తూ ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులున్నాయని, అభ్యంతరాలను స్వీకరించకుండానే తుది ఓటర్ల జాబితాను ప్రచురించారంటూ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story