ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ రద్దు..

Arun Chilukuri
Updated on: 11 Jan 2021 6:08 PM IST
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ రద్దు..
X

ap high court cancels local body election notification

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పంచాయతీ ఎన్నికలపై ఈసీ నోటిఫికేషన్ ను కోర్టు కొట్టివేసింది. కొవిడ్ వ్యాక్సినేషన్ ఎన్నికల ప్రక్రియకు అడ్డువస్తుందంటూ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల నిర్వహణపై విచారణ జరిపిన కోర్టు ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది. ప్రభుత్వ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కోర్టు నిర్ణయంతో యధావిధిగా ఇళ్ల పట్టాలు, అమ్మఒడి పథకాలు కొనసాగించనున్నది రాష్ర ప్రభుత్వం. తాజా తీర్పు నేపథ్యంలో డివిజినల్‌ బెంచ్‌కు వెళ్లాలని ఎస్‌ఈసీ నిర్ణయించినట్లు సమాచారం.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story