Andhra Pradesh: కోవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15వేలు సాయం


corona patient Funerals
Andhra Pradesh: కరోనా మహమ్మారి రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంది. కరోనా బారిన పడి మరణించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. కరోనాతో మృతి...
Andhra Pradesh: కరోనా మహమ్మారి రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంది. కరోనా బారిన పడి మరణించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను ప్రభుత్వమే ఖననం చేస్తుంది. మృతుల అంత్యక్రియలకు సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 ఏడాదికి గాను కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు విడుదల చేస్తారని వివరించారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరిట ఉత్తర్వులు జారిచేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



